PM Modi ఆరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2021-07-16T17:30:29+05:30 IST

కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

PM Modi ఆరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య, రక్షణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కోవిడ్ నియంత్రణ, కట్టడి చర్యలు, టీకా పంపిణీ వేగవంతం చేయడం సహా రాష్ట్రాలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేయనున్నారు. 

Updated Date - 2021-07-16T17:30:29+05:30 IST