తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

ABN , First Publish Date - 2020-03-25T17:45:43+05:30 IST

తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్న ప్రధాని మోదీ.. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోందని, ఈ సంవత్సరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Updated Date - 2020-03-25T17:45:43+05:30 IST