“#9pm9minute,” అంటూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-04-05T18:59:31+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న

“#9pm9minute,” అంటూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జాతి ఐక్యతా సందేశం కోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు నిచ్చిన విషయం విదితమే. ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. “#9pm9minute,” అని సంక్షిప్త సందేశాన్ని ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాతి ఐక్యతా మంత్రం కోసం వారి వారి ఇళ్ల ముందు నిలబడి రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి దీపాలను లేదా క్యాండిల్స్‌ను లేదా సెల్‌ఫోన్ టార్చి లైటును వెలిగించాలని ప్రధాని మోదీ జాతికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-05T18:59:31+05:30 IST