జాంబియా జాతిపిత కౌండా కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

ABN , First Publish Date - 2021-06-18T05:00:35+05:30 IST

జాంబియా జాతిపిత కౌండా కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

జాంబియా జాతిపిత కౌండా కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

న్యూఢిల్లీ: జాంబియా జాతిపిత, తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా కన్నుమూశారు. ఆఫ్రికా స్వాతంత్ర్య యోధుడైన 97 ఏళ్ల కౌండా గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు జాంబియా అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు ప్రకటించారు. కాగా కౌండా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘గౌరవనీయ ప్రపంచ నాయకుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ కెన్నెత్ డేవిడ్ కౌండ మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబానికి, జాంబియా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి..’’ అని ప్రధాని పేర్కొన్నారు. 



Updated Date - 2021-06-18T05:00:35+05:30 IST