లాక్ డౌన్ లో మోదీ ఏమిచేస్తున్నారంటే...

ABN , First Publish Date - 2020-03-30T15:27:13+05:30 IST

కరోనా వైరస్ సంక్షోభం దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ గురించి మన్ కి బాత్ లో మాట్లాడారు. తాజాగా ఈరోజు ఉదయం...

లాక్ డౌన్ లో మోదీ ఏమిచేస్తున్నారంటే...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్  అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ గురించి మన్ కి బాత్ లో మాట్లాడారు. తాజాగా ఈరోజు ఉదయం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశారు. అలాగే ... మన్ కి బాత్ సందర్భంగా నా ఫిట్‌నెస్ దినచర్య గురించి అడిగారు. అందుకే ఈ యోగా వీడియోను షేర్ చేయాలని అనుకున్నాను. మీరు కూడా రోజూ యోగా చేస్తారని ఆశిస్తున్నాను.. అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తాను ఫిట్‌నెస్ నిపుణుడనో లేదా  వైద్య నిపుణుడినో కాదని ప్రధాని పేర్కొన్నారు. అయితే యోగా చేయడం చాలా సంవత్సరాలుగా జీవితంలో ఒక భాగంగా మారింది. ఎంతో ప్రయోజనం చేకూర్చింది. మీరు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ మార్గాలు అనుసరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 



Updated Date - 2020-03-30T15:27:13+05:30 IST