'న్యూట్రి ట్రైన్'లో ప్రయాణించిన మోదీ

ABN , First Publish Date - 2020-10-30T22:05:46+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. దేశంలో కోవిడ్..

'న్యూట్రి ట్రైన్'లో ప్రయాణించిన మోదీ

గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. దేశంలో కోవిడ్ మహమ్మారి చెలరేగిన అనంతరం గుజరాత్‌లో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కెవడియాలోని చిల్ట్రన్స్ న్యూట్రిషియన్ పార్క్‌లో ప్రధాని కొద్దిసేపు గడిపారు. 'న్యూట్రీ ట్రైను'లో ప్రయాణించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా రైలులో ప్రయాణించారు. దీనికి ముందు, గురువారంనాడు కన్నుమూసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కుటుంబాన్ని ప్రధాని పరామర్శించారు.


ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ప్రాంతంలో 17 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కెవడియాలో మరో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ దేవ్‌వ్రత్ సాదర స్వాగతం పలికారు.



Updated Date - 2020-10-30T22:05:46+05:30 IST