నర్సంపేటలో ఘనంగా పోచమ్మ బోనాలు
ABN , First Publish Date - 2020-08-03T10:51:12+05:30 IST
నర్సంపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు
నర్సంపేట, ఆగస్టు 2 : నర్సంపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అనేక వార్డులకు చెందిన మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని పట్టణంలోని వరంగల్రోడ్లో గల పోచమ్మదేవాలయం వద్దకు చేరుకున్నారు.
పోచమ్మ తల్లిని క్యూ పద్ధతిలో వెళ్లి తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టిపద్మప్రసాద్ దంపతులతో పాటు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. పోచమ్మతల్లీ పిల్లా,పాపలను, కుటుంబ సభ్యులను చల్లంగ చూడు అంటూ వేడుకున్నారు. బోనాలతో తరలివచ్చిన మహిళలతో పోచమ్మ దేవాలయం సందడిగా మారింది.
తిమ్మంపేటలో బోనాల పండుగ
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేటలో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా భౌతిక దూరం పాటించాలని, ఇళ్ల నందే జరుపుకోవాలని గ్రామ పంచాయతీ వారు నిబంధనలు పెట్టడంతో ఇళ్లలోనే మొక్కులు తీర్చుకున్నారు.