పోడు భూములకు పట్టాలివ్వాలి
ABN , First Publish Date - 2021-05-17T04:32:44+05:30 IST
ఎన్నో ఏళ్లుగా పోడుభూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ అన్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్
ఆసిఫాబాద్ రూరల్, మే 16: ఎన్నో ఏళ్లుగా పోడుభూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ అన్నారు. అన్నారు. ఆదివారం బెయిల్పై వచ్చిన సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు కొంగ సత్యనారా యణ, బాలకిషన్, ఉమామహేశ్వర్ రావును సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాబోయే రోజుల్లో రైతులు కేసీఆర్ ప్రభుత్వా నికి బుద్ది చెబుతారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యుడు బోనగిరి సతీష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రె విశాల్, నాయకులు సాయి, గణేష్, వెంకటేష్, వేణు, శ్రీను పాల్గొన్నారు.