కమ్మేస్తోన్న పొగమంచు
ABN , First Publish Date - 2021-01-21T06:01:58+05:30 IST
గత కొద్ది రోజులుగా దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత దశలో ఉన్న జీడి, మామిడితోపాటు పెసర, మినుము వంటి అపరాలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటలపై ప్రభావం
ఆందోళనలో రైతులు
ఎల్ఎన్ పేట : గత కొద్ది రోజులుగా దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత దశలో ఉన్న జీడి, మామిడితోపాటు పెసర, మినుము వంటి అపరాలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దాంతం, బొర్రంపేట, దబ్బపాడు, సుమంతాపురం, మిరియాపల్లి, కరకవలస, డొంకలబడవంజ, కొత్తజోగివలస, జంబాడ తదతర గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పెట్టుబడిలేని అపరాల పంటలపైనే రైతులు ఎక్కువగా ఆశపడుతుంటారు... ఈ పరిస్థితుల్లో పొగమంచు తమ ఆశలను అడియాశలు చేస్తుందని పలువురు రైతులు నిట్టూరుస్తున్నారు.