పీవోకే జారీ చేసిన వైద్య డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ
ABN , First Publish Date - 2020-08-15T07:48:00+05:30 IST
పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని మెడికల్ కాలేజీలు జారీ చేసిన డిగ్రీలు చెల్లవని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంసీఐ సెక్రటరీ జనరల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 14: పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని మెడికల్ కాలేజీలు జారీ చేసిన డిగ్రీలు చెల్లవని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంసీఐ సెక్రటరీ జనరల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఆ సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేసుకోమని, వాటిని కలిగి ఉన్న డాక్టర్లను సైతం ప్రాక్టీసుకు అనుమతించబోమని పేర్కొన్నారు.