పోలవరంపై బాంబ్ పేల్చిన కేంద్రం

ABN , First Publish Date - 2021-08-02T20:17:46+05:30 IST

పోలవరంపై కేంద్రం మరో బాంబ్ పేల్చింది. సవరించిన డీపీఆర్ అనుమతుల కోసం తమ దగ్గర వీపీ పెండింగ్‌లో లేవని కేంద్ర చెప్పింది.

పోలవరంపై బాంబ్ పేల్చిన కేంద్రం

ఢిల్లీ: పోలవరంపై కేంద్రం మరో బాంబ్ పేల్చింది. సవరించిన డీపీఆర్ అనుమతుల కోసం తమ దగ్గర వీపీ పెండింగ్‌లో లేవని కేంద్రం చెప్పింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ బదులిచ్చారు. 2011-19లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని కేంద్రం పేర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సవరించిన డీపీఆర్‌ను సమర్పించలేదని కేంద్రం తెలిపింది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 54 వేల కోట్లు రూపాయలు ఆమోదించాలని, ఇటీవల కేంద్రమంత్రిని కలిసి వైసీపీ ఎంపీలు కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించామని, ఆర్థికశాఖకు పంపుతామని కేంద్రమంత్రి తెలిపారని ఎంపీలు మీడియా సమవేశంలో పేర్కొన్నారు. అయితే ఈ రోజు కేంద్రం సమాధానం చూస్తే డీపీఆర్ పెండింగ్‌లో లేదని, పెరిగిన అంచానాలను 2011-19లోనే ఆమోదించామని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. 


ఇటీవల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం తేల్చేసింది. 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలం టూ కుండబద్దలు కొట్టింది. తద్వారా పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు గానీ, సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు గా నీ కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విషయంలోనే కాకుండా డయాఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణంలో డిజైన్‌ల మార్పులను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదిస్తే తప్ప పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణలోనికి రాదని కరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-02T20:17:46+05:30 IST