చిత్తశుద్ధితో పోలవరం పనులు చేపట్టిన చరిత్ర చంద్రబాబుది: కనకమేడల
ABN , First Publish Date - 2021-08-05T00:54:30+05:30 IST
చిత్తశుద్ధితో పోలవరం పనులు చేపట్టిన చరిత్ర మాజీసీఎం చంద్రబాబుదేనని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
ఢిల్లీ: చిత్తశుద్ధితో పోలవరం పనులు చేపట్టిన చరిత్ర మాజీసీఎం చంద్రబాబుదేనని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై పార్లమెంట్లో కూడా ప్రశ్నించామని తెలిపారు. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎంపీ రామ్మోహన్నాయుడు తప్పుబట్టారు. పోలవరం నిర్వాసితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిర్వాసితుల సమస్య తమ సమస్యగా తీసుకుంటున్నామని రామ్మోహన్నాయుడు చెప్పారు.