పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-07-17T11:28:56+05:30 IST

ఎన్నికల ముందు పోల వరం నిర్వాసితులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం..

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష


కుక్కునూరు, జూలై 16 : ఎన్నికల ముందు పోల వరం నిర్వాసితులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వ ర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తు న్నారని ఆరోపించారు. మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు, మహబూబ్‌ బాషా, వై.సాయికిరణ్‌, లక్ష్మయ్య, బుయ్యన శ్రీను, వలీబాషా పాల్గొన్నారు. వీరికి పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.  

Updated Date - 2020-07-17T11:28:56+05:30 IST