పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-23T05:21:34+05:30 IST
పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిం తూరు ఐటీడీఏ పీవో ఏ.వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు.
చింతూరు, జూన్ 22: పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిం తూరు ఐటీడీఏ పీవో ఏ.వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రానున్న వరదల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, మూడు మాసాలకు సరి పడా నిత్యావసర వస్తువులను లోతట్టు ప్రజలకు అందజేయాలని, లాంచీలు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం జగన్ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి రాష్ట్ర కాలంలో భూమిని నష్టపోయిన రైతాంగానికి తిరిగి ఎకరాకు రూ.5 లక్షల వంతున నష్ట పరిహారం చెల్లించా లన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్క నిర్వాసితునికి విధిగా పరిహారం చెల్లిం చాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమం లో టీడీపీ మండలాధ్యక్షుడు ఓబిళ్ళనేని రామారావు చౌదరి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎండీ జహంగీర్, చిన్నారెడ్డి తుర్రం తమ్మయ్య పాల్గొన్నారు.