మహిళలను రక్షించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-11-28T05:52:13+05:30 IST

నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు మహిళలను పోరుమామిళ్ల హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతయ్య, ఓబులేసు సురక్షితంగా వడ్డుకు చేర్చారు.

మహిళలను రక్షించిన పోలీసులు
నీటి ప్రవాహంలో చిక్కుకున్న మహిళలను ఒడ్డుకు చేరుస్తున్న పోలీసులు

పోరుమామిళ్ల, నవంబరు 27 :నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు మహిళలను పోరుమామిళ్ల హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతయ్య, ఓబులేసు సురక్షితంగా వడ్డుకు చేర్చారు. పోరుమామిళ్ల మండలంలోని గానుగపెంట పంచాయతీ పరిధిలో రేపల్లె హరిజనవాడ సమీపంలోని కొట్టాలుపల్లెకు చెందిన ఐదుగురు  మహిళలు పనికి గానుగపెంటకు వెళ్లారు. మొదట్లో ప్రవాహం తక్కువగా ఉండటంతో తమ గ్రామానికి వెళ్లేందుకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో కొద్దిదూరం రాగానే ప్రవాహం ఉధృతి పెరగడంతో రక్షించండంటూ కేకలు వేశారు. పోరుమామిళ్ల నుంచి చెరువులు, వాగుల వంకల పరిస్థితి తెలుసుకునేందుకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతయ్య, కానిస్టేబులు ఓబులేసు మహిళల కేకలు విని వంతెన మధ్యకు వెళ్లి వారిని వడ్డుకు చేర్చారు. 

Updated Date - 2020-11-28T05:52:13+05:30 IST