మేడ్చల్...అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-08T23:13:09+05:30 IST

మేడ్చల్...అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

మేడ్చల్...అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

మేడ్చల్: అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కాలనీలలో, బస్తీలలో పూసలు ఇతర సామాన్లు అమ్మే నెపంతో తాళాలు ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితులు నలుగురు పరారీలో ఉన్నారు. 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర తులాల బంగారం, రెండు మొబైల్స్, రెండు మోటార్ సైకిళ్ళు, ఒక వెండి కాయిన్.  సహా దొంగతనాలకు ఉపయోగించే కత్తులు, కొడవళ్ళు, కట్టర్స్, సుత్తెలు, స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-03-08T23:13:09+05:30 IST