కరోనాపై వదంతులు వ్యాప్తి చేసిన మహిళ సహా ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-02T18:24:29+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వదంతులను వ్యాప్తి చేస్తున్న ఓ మహిళ సహా ముగ్గురిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు.....

కరోనాపై వదంతులు వ్యాప్తి చేసిన మహిళ సహా ముగ్గురి అరెస్ట్

భద్రాక్ (ఒడిశా): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వదంతులను వ్యాప్తి చేస్తున్న ఓ మహిళ సహా ముగ్గురిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ పట్ణణంలో ఓ మహిళతో సహా ముగ్గురు కరోనాపై ప్రజల్లో భయాందోళనలు రేపేలా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ ముగ్గురు సోషల్ మీడియా వేదికగా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని భద్రాక్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించగా కొందరు వదంతులు వ్యాప్తిచేస్తుండటంతో పోలీసులు వారిపై కఠినచర్యలకు ఉపక్రమించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.

Updated Date - 2020-04-02T18:24:29+05:30 IST