విద్యార్థులపై పోలీసుల దాడి దారుణం: లోకేష్

ABN , First Publish Date - 2021-11-10T23:42:00+05:30 IST

విద్యార్థులపై పోలీసుల దాడి దారుణమని టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

విద్యార్థులపై పోలీసుల దాడి దారుణం: లోకేష్

అనంతపురం: విద్యార్థులపై పోలీసుల దాడి దారుణమని టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను కొట్టి.. ఇప్పుడు కొట్టలేదని చెబుతున్నారని తప్పుబ్టారు. అసలు కాలేజీలోకి పోలీసులు ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై సీఎం జగన్ కన్నేశారని లోకేష్ ఆరోపించారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేట్ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడకుండా జోవో విడుదల చేశారని విమర్శించారు. వారం రోజుల్లో జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ పథకాలకు జగనన్న పేరు పెట్టారని తప్పుబట్టారు. జగనన్న కాదు.. జగనన్న దున్న అని పెట్టాలని నారా లోకేష్ అన్నారు.




Updated Date - 2021-11-10T23:42:00+05:30 IST