చింతమనేనిపై పోలీసుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-08-28T20:20:02+05:30 IST

పశ్చిమగోదావరి: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా జిల్లాలోని దెందలూరులో శనివారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా చింతమనేని..

చింతమనేనిపై పోలీసుల దౌర్జన్యం

పశ్చిమగోదావరి: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా జిల్లాలోని దెందలూరులో శనివారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా చింతమనేని.. దున్నపోతులతో బండి నడిపి నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అదే సమయంలో టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా.. వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో అనుమతి లేదని పోలీసులు టీడీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, చింతమనేనికి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల దౌర్జన్యంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-28T20:20:02+05:30 IST