విచారణ పేరుతో పనిమనిషిపై పోలీసుల క్రూరత్వం

ABN , First Publish Date - 2022-01-22T21:58:18+05:30 IST

విచారణ పేరుతో పనిమనిషిపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. జిల్లా

విచారణ పేరుతో పనిమనిషిపై పోలీసుల క్రూరత్వం

చిత్తూరు: విచారణ పేరుతో పనిమనిషిపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల రెడ్డి ఇంట్లో రెండు లక్షల నగదు మాయమయ్యాయి. అయితే దొంగతనం చేసిందనే నెపంతో పనిమనిషి ఉమా మహేశ్వరిని విచారణకు పిలిచి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు చితక బాదారు. దీంతో పనిమనిషి ఉమా మహేశ్వరి తీవ్ర గాయాలపాలైంది. అనంతరం దొంగతనంపై పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. దొంగతనం చేసింది ఉమా మహేశ్వరి కాదని తెలుసుకున్నారు. బాధితురాలిని పిలిచి తాము కొట్టి గాయపరచిన విషయాన్ని బయటకు చెప్పొద్దని బాధితురాలిని పోలీసులు బెదిరించారు. ఆస్పత్రి ఖర్చులు తామే భరిస్తామని ఉమా మహేశ్వరికి పోలీసులు నచ్చ చెప్పారు. అకారణంగా తనను పోలీసులు గాయ పరిచారని, న్యాయం చేయాలని మీడియాను బాధితురాలు ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


Updated Date - 2022-01-22T21:58:18+05:30 IST