యువరాజ్పై పోలీసు కేసు
ABN , First Publish Date - 2020-06-05T09:16:36+05:30 IST
భారత జట్టు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్పై హరియాణాలో పోలీసు కేసు నమోదైంది. రోహిత్ శర్మతో కలిసి ఇన్స్టా లైవ్లో ...
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్పై హరియాణాలో పోలీసు కేసు నమోదైంది. రోహిత్ శర్మతో కలిసి ఇన్స్టా లైవ్లో పాల్గొన్న యువీ.. స్పిన్నర్ చాహల్ను ఉద్దేశిస్తూ ఓ కులాన్ని కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు ఇప్పటికే యువరాజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా.. తాజాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సాన్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు. వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.