విదేశీయులపై కేసులు

ABN , First Publish Date - 2020-04-07T14:12:22+05:30 IST

పర్యటక వీసా మీద వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నందుకు 10 మంది ఇండోనేషియన్లతో పాటు యూపీకి చెందిన ఇద్దరు గైడ్‌లు, వారికి సహాయకులుగా పనిచేసిన ముగ్గురు కరీంనగర్‌ స్థానికుల పైనా కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

విదేశీయులపై కేసులు

హైదరాబాద్‌/కరీంనగర్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): పర్యటక వీసా మీద వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నందుకు 10 మంది ఇండోనేషియన్లతో పాటు యూపీకి చెందిన ఇద్దరు గైడ్‌లు, వారికి సహాయకులుగా పనిచేసిన ముగ్గురు కరీంనగర్‌ స్థానికుల పైనా కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 269, 270, 188 సెక్షన్ల కింద, ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 సెక్షన్‌ 3 కింద, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 సెక్షన్‌ 51(బీ), పారినర్స్‌ యాక్ట్‌ 1946 సెక్షన్‌ 14(1)(బీ), 7, 13, 14(సీ) కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో మరో ఆరుగురు మలేషియన్లపై ఇవే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. వారు కూడా మర్కజ్‌ మసీదు సభకు హాజరై, హైదరాబాద్‌కు వచ్చారు.

Updated Date - 2020-04-07T14:12:22+05:30 IST