చెత్త ఏరుకునే మహిళ ఇంట్లో రూ.2లక్షల నగదు లభ్యం

ABN , First Publish Date - 2020-08-14T23:23:58+05:30 IST

చెత్త ఏరుకునే ఓ మహిళ ఫుట్ పాత్ పై మరణించడంతో ఆమె ఇంట్లో రూ.2లక్షల నగదు, బంగారం బయటపడింది.....

చెత్త ఏరుకునే మహిళ ఇంట్లో రూ.2లక్షల నగదు లభ్యం

చెన్నై (తమిళనాడు) : చెత్త ఏరుకునే ఓ మహిళ ఫుట్ పాత్ పై మరణించడంతో ఆమె ఇంట్లో రూ.2లక్షల నగదు, బంగారం బయటపడింది. చెత్త ఏరుకునే ప్రభావతి (57) అనే మహిళ చెన్నై నగరంలోని సెక్రటేరియెట్ కాలనీలో ఫుట్ పాత్ పై మరణించింది. ప్రభావతికి రాజేశ్వరి, విజయలక్ష్మీలనే ఇద్దరు అక్కలున్నారు. వారికి ఒట్టేరిలోని స్లమ్ క్లియరెన్స్ బోర్డులో ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ లో చెత్త పేరుకుపోవడంతో తాము ఫుట్ పాత్ పై నివాసముంటున్నామని మృతురాలి అక్కలు చెప్పారు. దీంతో పోలీసులు మున్సిపల్ సిబ్బందితో వారి ఫ్లాట్ శుభ్రం చేయించారు. చెత్త ఏరుకునే ప్రభావతి ఇంట్లో ఓ కుండలో నాణాలు, మరో కుండలో కరెన్సీ నోట్లు, బంగారు బిస్కెట్లు దొరికాయి. రూ.2లక్షల నగదుతోపాటు రద్దు అయిన పాత 500,1000 రూపాయల నోట్లు లభించాయి. 


Updated Date - 2020-08-14T23:23:58+05:30 IST