పోలీసుల తీరుపై తోట అసహనం

ABN , First Publish Date - 2021-06-23T06:10:08+05:30 IST

తోట త్రిమూర్తులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుపై తోట అసహనం

రావులపాలెం రూరల్‌, జూన్‌ 22: తోట త్రిమూర్తులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తోటను గజమాలతో సత్కరించేందుకు కపిలేశ్వరం మండలం కేదార్లంకకు చెందిన సర్పంచ్‌ వీరి వెంకటరెడ్డి అభిమానులతో రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌కు చేరుకున్నారు. గజమాలను వేసేందుకు క్రేన్‌ను తేవడంతో పోలీసులు క్రేన్‌ను తొలగించాలంటూ ఆపరేటర్‌ను ఆదేశించారు. ఈసమయంలో సర్పంచ్‌ క్రేన్‌లో కూర్చుని గజమాల వేసేదాకా దిగేదిలేదన్నారు. దీంతో కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడకు చేరుకున్న తోట విషయాన్ని తెలుసుకుని నేనేదైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడానంటారు, ఈసమయంలో అభిమానులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం అభిమానులు గజమాలను వేశారు.


Updated Date - 2021-06-23T06:10:08+05:30 IST