పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : సీఆర్పీఎఫ్ ఏసీ ముర్గవేల్
ABN , First Publish Date - 2021-10-22T06:28:18+05:30 IST
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని చింతపల్లి సీఆర్పీఎఫ్ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ముర్గవేల్ అన్నారు.
చింతపల్లి, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని చింతపల్లి సీఆర్పీఎఫ్ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ముర్గవేల్ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ముర్గవేల్ మాట్లాడుతూ, దేశ భద్రత, రక్షణ కోసం 24 గంటలు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు.కుటుంబం, స్వగ్రామాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేస్తున్న పోలీసు, జవాన్ల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, ఏపీఎస్పీ పోలీసులు పాల్గొన్నారు.