బందరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2022-01-26T05:48:26+05:30 IST
బందరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి
ఉదయం 11 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా జాతీయజెండా ఆవిష్కరణ
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: 73వ గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం ఉదయం 11గంటలకు కలెక్టర్ నివాస్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించాక, 11.10 గంటలకు జిల్లా ప్రగతిపై కలెక్టర్ ప్రసంగిస్తారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. అత్యుత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లను జేసీ కె.మాధవీలత, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్ డి.సునీల్కుమార్, రిజర్వు పోలీస్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఆయా శాఖల ప్రగతిని వివిరిస్తూ శకటాలు, స్టాల్స్ను ఏర్పాటు చేశారు.