పాతబస్తీలో గోదాములపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-09-21T07:48:50+05:30 IST
గుట్కా, విదేశీ సిగరెట్లు అక్రమంగా నిల్వ ఉంచిన పాతబస్తీలోని పలు గోదాములపై దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, స్థానిక
రూ. 10 లక్షల విలువైన గుట్కా, విదేశీ సిగరెట్లు స్వాధీనం
మదీన, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): గుట్కా, విదేశీ సిగరెట్లు అక్రమంగా నిల్వ ఉంచిన పాతబస్తీలోని పలు గోదాములపై దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు దాడిచేసి రూ. 10 లక్షల విలువ చేసే సరుకు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ రాయల్సీ హోటల్ సమీపంలోని ఫర్హాన్ కాలనీలో అబ్దుల్ షుకూర్ అనే వ్యక్తి ఆర్ఎఫ్ చాలియా స్టోర్స్ పేరుతో గోదాము నిర్వహిస్తున్నాడు. గోదాములో గుట్కాలు, విదేశీ సిగరెట్లు నిల్వ చేసి పాన్షాపులు, కిరాణా దుకాణాలతోపాటు తెలిసిన వారికి సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. రూ. 8 లక్షల విలువైన గుట్కాలు, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. గోదాము నిర్వాహకుడు అబ్దుల్ షుకూర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవానీనగర్లో..
భవావీనగర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని అమాన్నగర్-బి నషేమాన్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రిజ్వాన్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 2 లక్షల విలువైన గుట్కా, ఇతర ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.