గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-06-22T06:00:55+05:30 IST

జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 21: జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండవ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తాటిగూడ కాలనీలో ఓ ఇంట్లో భారీ స్థాయిలో గుట్కా నిల్వ ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో టూటౌన్‌ సీఐ పోతారం శ్రీనివాస్‌తో కలిసి రహస్యంగా ఆటోలో వెళ్లి ఆచూకి తెలుసుకుని తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో 6 లక్షల విలువైన వీ 1 పేరు గల గుట్కా ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకుని తాటిగూడకు చెందిన ఇద్దరు నిందితులైన షేక్‌ నిసార్‌ ఆలియాస్‌ సమీర్‌ను, షేక్‌ సలీంను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు ఇతర రాష్ర్టాల ఉంచి దిగుమతి చేసుకుని ఇంట్లో నిల్వ చేసుకుని పట్టణంలో ఇద్దరు కలిసి చిరు వ్యాపారులకు సరఫరా చేస్తుండే వారని తెలిపారు. వీరి వద్ద 8 పెద్ద డబ్బాలు, 14 గోనె సంచుల్లో దాచి ఉంచిన వీ 1 గుట్కా ప్యాకెట్లను పోలీసుస్టేషన్‌కు తరలించామన్నారు. ఇందులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రమేష్‌, శోభన్‌కుమార్‌, మంగల్‌సింగ్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-06-22T06:00:55+05:30 IST