పెదఉప్పలం శివార్లలో ఆన్‌లైన్‌ రమ్మీ

ABN , First Publish Date - 2021-06-23T05:23:11+05:30 IST

మండలంలోని పెదఉప్పలంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్న వారిపై దాడులు జరిపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ చక్రధర్‌ తెలిపారు.

పెదఉప్పలం శివార్లలో ఆన్‌లైన్‌ రమ్మీ
ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు

పోలీసుల దాడి... 31 సెల్‌ఫోన్లు స్వాధీనం

ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు


ఎస్‌.రాయవరం, జూన్‌ 22: మండలంలోని పెదఉప్పలంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్న వారిపై దాడులు జరిపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ చక్రధర్‌ తెలిపారు. గ్రామానికి ఆనుకుని వున్న తోటల్లో బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన కొందరు యువకులు నిషిద్ధ ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నట్టు సమాచారం రావడంతో సోమవారం రాత్రి చేశామని, పోలీసుల రాకను గమనించి పలువురు పరారయ్యారని చెప్పారు. ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకుని వారి నుంచి 31 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2021-06-23T05:23:11+05:30 IST