పోలీసులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-05-22T09:29:58+05:30 IST
కరోనా నివారణలో భాగంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం కులకచర్ల పీఎ్సను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు.
కులకచర్ల: కరోనా నివారణలో భాగంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం కులకచర్ల పీఎ్సను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. హైదరాబాద్లో కరోనాతో సిబ్బంది ఒకరు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉండేలా చూడాలని వివరించారు. ఆయన వెంట పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం దోమ పోలీ్సస్టేషన్ను సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఐ సురేష్ సిబ్బంది ఉన్నారు.