అనధికార చిట్టీలతో మోసపోవద్దు

ABN , First Publish Date - 2022-01-25T04:26:43+05:30 IST

అనధికార చిట్టీలు వేసి మోసపోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సీహెచ్‌ విజయరావు సూచించారు.

అనధికార చిట్టీలతో మోసపోవద్దు
ఫిర్యాదు దారులకు భోజనం పెడుతున్న ఏఎస్పీ వెంకటరత్నం

ఎస్పీ సీహెచ్‌ విజయరావు

నెల్లూరు(క్రైం), జనవరి 24: అనధికార చిట్టీలు వేసి మోసపోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సీహెచ్‌ విజయరావు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యతని, అటువంటి ఫిర్యాదులను జాప్యం లేకుండా చట్టప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. భూమి, సివిల్‌, కోర్టు పరిధిలోని వివాదాల్లో న్యాయపరమైన సలహాలు పొందిన తరువాతే చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపిగ్గా విని, సంబంధిత అధికారుతో ఫోన్లో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఎస్పీ స్పందనకు 55 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ పీ.వెంకటరత్నం, డీఎస్పీలు పాల్గొన్నారు. ఫిర్యాదు దారులకు భోజన వసతి కల్పించారు. 

Updated Date - 2022-01-25T04:26:43+05:30 IST