మిడతలను వెళ్లగొట్టేందుకు అధికారుల వినూత్న ప్రయోగం!
ABN , First Publish Date - 2020-05-28T23:39:48+05:30 IST
పెద్దమొత్తంలో దాడికి దిగుతున్న ఎడారి మిడతలను భయపెట్టి వెళ్లగొట్టేందుకు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా
భోపాల్: పెద్దమొత్తంలో దాడికి దిగుతున్న ఎడారి మిడతలను భయపెట్టి వెళ్లగొట్టేందుకు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామాలపై దండెత్తుతున్న మిడతల దండును భయపెట్టేందుకు అధికారులు పోలీసు వాహనాల సైరన్లను ఉపయోగిస్తున్నారు. పన్నా టైగర్ రిజర్వులో పెద్ద ఎత్తున కనిపించిన ఈ మిడతల సమూహాన్ని భయపెట్టి వెనక్కి పంపేందుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు, అగ్నిమాపక యంత్రాల సైరన్లు ఉపయోగిస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. రాజస్థాన్లో ఈ మిడతలను భయపెట్టేందుకు ప్రజలు స్టీలు పాత్రలను చప్పుడు చేయడం కనిపించింది. కాగా, ఐదు రాష్ట్రాలు ఈ మిడతల బారినపడ్డాయి.