పోలీసుల అత్యుత్సాహం.. డ్రైనేజీలో పడిన విద్యార్థులు

ABN , First Publish Date - 2021-08-06T23:48:15+05:30 IST

పట్టణంలోని శివాజీ నగర్ సెంటర్‌లో టూటౌన్‌ పోలీసులు అత్యుత్సాహం

పోలీసుల అత్యుత్సాహం.. డ్రైనేజీలో పడిన విద్యార్థులు

నల్గొండ: పట్టణంలోని శివాజీ నగర్ సెంటర్‌లో టూటౌన్‌ పోలీసులు అత్యుత్సాహం చూపారు. మాస్కులు ధరించని వాహనదారులకు పోలీసులు ఫైన్స్ వేసారు. ఈ సందర్భంగా పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో బైక్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులు రాజీవ్‌, ప్రదీప్‌ డ్రైనేజీలో పడిపోయారు. విద్యార్థులకు తలకు  తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులపై తీరుపై  స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-06T23:48:15+05:30 IST