డ్రైవర్‌కు వేసిన జరిమానాను తానే చెల్లించిన పోలీస్! కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-08-15T01:57:19+05:30 IST

డ్రైవర్ చెల్లించాల్సిన రూ.2 వేల జరిమానాను పోలీసు ఆధికారే చెల్లించిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తాజాగా చోటుచేసుకుంది.

డ్రైవర్‌కు వేసిన జరిమానాను తానే చెల్లించిన పోలీస్! కారణమేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ చెల్లించాల్సిన రూ.2 వేల జరిమానాను పోలీసు ఆధికారే చెల్లించిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తాజాగా చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ రోహిత్ ఖడ్సే చెల్లించాల్సిన జరిమానాను అజయ్ కుమార్ మాల్వియా అనే పోలీసు అధికారి స్వయంగా చెల్లించారు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం జరగక ఖడ్సే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే..జరిమానా చెల్లించలేని కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఇటీవల అతడి ఆటోను సీజ్ చేశారు. దీన్ని విడిపించుకునేందుకు ఖడ్సే తన కొడుకు కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను తీసుకోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాల్వియా తానే స్వయంగా ఆ జరిమానాలు చెల్లించారు. లాక్‌డౌన్ కారణంగా ఖడ్సే అప్పుల్లో కూరుకుపోయాడని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-15T01:57:19+05:30 IST