పోలీసులూ..జాగ్రత్త!
ABN , First Publish Date - 2020-06-04T09:05:47+05:30 IST
పౌరుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు హైదరాబాద్ నగర కమిషనర్
కమ్యూనిటీ పోలీసింగ్ను గౌరవించాలి
ట్విటర్లో హైదరాబాద్ సీపీ
యూఎస్లో ఆందోళనలపై ప్రస్తావన
హైదరాబాద్ సిటీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): పౌరుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. యూఎస్లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలను ట్విటర్లో ప్రస్తావించారు. అమెరికాలో పోలీసుల చర్య ఆ దేశ ప్రతిష్ఠను దిగజార్చిందని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను గౌరవించాలని, ప్రతి పౌరుడి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని పోలీసులను సీపీ కోరారు. కాగా, సీపీ ట్వీట్కు స్పందన కూడా భారీగానే వచ్చింది. చాలా మంది పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నప్పటికీ దేశంలో నేటికీ లాక్పడెత్లు, అమాయక పౌరులను హింసిస్తున్న ఘటనలు చోటుచేసుకోవడం విచారకరమని నెటిజన్లు వ్యాఖ్యానించారు.