రైల్వే మంత్రికి వీడ్కోలు
ABN , First Publish Date - 2021-06-14T05:44:08+05:30 IST
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.
రేణిగుంట, జూన్ 13: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. రెండురోజుల తిరుమల, తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన ఆదివారం తిరుగుప్రయాణమయ్యారు. ఉదయం 11 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో మంత్రి బుగ్గన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, జీఎం గజానన్మాల్యా, ఎయిర్పోర్టు డైరెక్టర్ సురేష్, బీజేపీ నేతలు భానుప్రకా్షరెడ్డి, కోలా ఆనంద్ తదితరులు ఉన్నారు.