సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు: పవన్
ABN , First Publish Date - 2021-11-02T01:04:47+05:30 IST
సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్ను..
విశాఖ: సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్ను నడపడం లేదన్నారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని చెప్పారు. ఎత్తెన కట్టడం కట్టాలంటే.. లోతైన పునాది వేయాలన్నారు. పునాది వేసి ఏడేళ్లవుతుందని, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని పవన్కల్యాణ్ సూచించారు.
‘‘వైసీపీ నేతలకు మాట్లాడడం రాదు.. అరుపులు, కేకలు తప్ప. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికా మిమ్మల్ని ఎన్నుకుంది? సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే.. ప్రజల ఆకలి తీరుతుందా? చదువుకోవాల్సిన 10 ఏళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీని ఓడించాలంటే జనసైనికుల్లో ఐక్యత ముఖ్యం’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.