నిమ్మలో పొలుసు పురుగు నివారణపై అవగాహన
ABN , First Publish Date - 2021-07-24T03:23:57+05:30 IST
మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్ విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు.
బాలాయపల్లి, జూలై 23 : మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్ విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు. నిమ్మలో పొలుసు పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉద్యానశాఖ అధికారి ఆనంద్ వివరించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, ఓబయ్య, విజయశ్రీ, శిరీష, మల్లిఖార్జున్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.