పాలిటెక్నిక్ పేపర్లీక్పై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-11T05:07:40+05:30 IST
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సెకండ్షిప్ట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సెమిస్టర్ ప్రశ్నపత్రం లీక్ అవ్వటంపై కాకినాడు జేఎన్టీయూ బోర్డు సభ్యులు, రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరిశీలకులు విజ్ఞానకుమార్తో కలిసి శనివారం బాపట్ల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాపట్లరూరల్, ఏప్రిల్ 10: బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సెకండ్షిప్ట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సెమిస్టర్ ప్రశ్నపత్రం లీక్ అవ్వటంపై కాకినాడు జేఎన్టీయూ బోర్డు సభ్యులు, రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరిశీలకులు విజ్ఞానకుమార్తో కలిసి శనివారం బాపట్ల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పేపర్ లీకేజిపై అధికారులు విచారణ చేసి దీనికి ముగ్గురు సూత్రధారులుగా నిర్ధారించారు. వీరిని విధులు నుంచి తొలిగిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించినప్పటికీ ఇందులో ఎవరిపాత్ర ఎంత, ఇంకా ఎవరైన ఉన్నారా అనేదానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రూరల్ సీఐ కె.శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలిపారు.