అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం పప్పు.!
ABN , First Publish Date - 2021-03-05T05:43:26+05:30 IST
అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం పప్పు.!
దోమ: మండల పరిధిలోని పాలెపల్లి అంగన్వాడీ సెంటర్ ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న కందిపప్పు పుచ్చుపట్టి నాసిరకంగా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అంగన్వాడీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఇచ్చిన పప్పునే అందజేశామని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ సెంటర్లో అందించే కంది పప్పు నాణ్యతగా ఉండేలా చూడాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.