ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి

ABN , First Publish Date - 2021-10-20T03:09:51+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండకట్టాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి
మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గంగోటిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

 - మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి, అక్టోబరు 19: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండకట్టాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలోని టీడీపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన పట్టణ, రూరల్‌ మండల కార్యచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ దోపిడీని, మభ్యపెట్టేమాటలను, చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పంచాయితీ వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై  తీర్మానాలు ఆమోదించారు.


 కురుగొండ్లతో కలిసి పయనిస్తా...


 మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పనిచేసి, వెంకటగిరి నియోజకవర్గంలో  టీడీపీకి గత వైభవం తీసుకువస్తానని ఆ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక తెలుగుదేశఽం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గంగోటి నాగేశ్వరరావులను టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం గంగోటి మాట్లాడుతూ  తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరిం చిన వారందరికీ  కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు శ్రీరాందాస్‌ గంగాధరం, గెరిటి చెంచయ్య, టీవీఆర్‌, కేవీకే ప్రసాద్‌ నాయుడు, పప్పు చంద్రమౌళిరెడ్డి, కాపా శ్రీనివాసుల బీరం రాజేశ్వరరావు, గల్లా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T03:09:51+05:30 IST