ఒమన్లో తగ్గుతున్న భారతీయ సమాజం జనాభా !
ABN , First Publish Date - 2020-10-30T00:46:10+05:30 IST
గల్ఫ్ దేశమైన ఒమన్లో భారత ప్రవాసుల జనాభా క్రమంగా తగ్గుతోంది. తాజాగా వెలువడిన ఓ నివేదిక గణాంకాల ప్రకారం ఒమన్లోని భారతీయుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
మస్కట్: గల్ఫ్ దేశమైన ఒమన్లో భారత ప్రవాసుల జనాభా క్రమంగా తగ్గుతోంది. తాజాగా వెలువడిన ఓ నివేదిక గణాంకాల ప్రకారం ఒమన్లోని భారతీయుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఒమన్లో ఉన్న భారత ప్రవాసులు కేవలం 4,99,431 మంది మాత్రమే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం చేపట్టిన ఒమనైజేషన్ ప్రక్రియ అయితే, రెండోది కరోనా నేపథ్యంలో భారీ సంఖ్యలో భారత ప్రవాసులు స్వదేశానికి తిరిగి వచ్చేయడం. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 2020 మూడో త్రైమాసికం ముగిసే సమయానికి భారత సమాజం జనాభా 20 శాతం క్షీణించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, భారతీయ సమాజం ఇప్పటికీ సుల్తానేట్లో అతిపెద్ద ప్రవాస సమాజంగా ఉంది. ఇక ఒమన్ మొత్తం జనాభాలో(4.6 మిలియన్) 40 శాతానికి పైగా విదేశీయులే ఉన్నారు.