పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు.. కరోనా బారిన పడ్డ దేశాధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-01-13T01:26:31+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరిని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు.

పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు.. కరోనా బారిన పడ్డ దేశాధ్యక్షుడు

లిస్బన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరిని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశ ప్రధానులు, అధ్యక్షులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో డీ సౌసా(72) కూడా చేరారు. మార్సెలోకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జనవరి 24న పోర్చుగల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మార్సెలో రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా సోకడంతో అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేయాల్సి వచ్చింది. కాగా.. పోర్చుగల్‌లో ఇప్పటివరకు 4.8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-01-13T01:26:31+05:30 IST