పోసాని ఇంటిపై దాడి ఎలా జరిగింది..? ఏం జరిగింది..? పనిమనిషి మాటల్లో...

ABN , First Publish Date - 2021-09-30T19:56:09+05:30 IST

సినీ రచయిత, నటుడు, వైసీపీ అభిమాని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.

పోసాని ఇంటిపై దాడి ఎలా జరిగింది..? ఏం జరిగింది..? పనిమనిషి మాటల్లో...

హైదరాబాద్: సినీ రచయిత, నటుడు, వైసీపీ అభిమాని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై పోసాని ఇంటి పనిమనిషి మీడియాతో మాట్లాడుతూ...పదేళ్ల నుంచి పనిచేస్తున్నామని చెప్పింది. పోసాని కుటుంబం 8 నెలల నుంచి ఇక్కడ ఉండడంలేదని తెలిపింది. తామే రాత్రివేళ ఇక్కడ పడుకుంటున్నామని.. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంటిపై రాళ్లు విసిరి, పోసాని భార్యభర్తలను పచ్చి బూతులు తిడుతూ రోడ్డుపై తిరిగారని చెప్పింది. దీంతో తాము భయంతో బయటకు రాలేదని, పురోషోత్తం అన్నకు ఫోన్ చేశామంది. ఆయన వచ్చి పోలీసులకు ఫోన్ చేశారని, పోలీసులు వచ్చి ఉదయం వరకు ఉండి వెళ్లిపోయారని పనిమనిషి తెలిపింది.


అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలోగుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Updated Date - 2021-09-30T19:56:09+05:30 IST