పాజిటివ్‌.. నెగెటివ్‌.. పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-09T10:14:13+05:30 IST

పాజిటివ్‌.. నెగెటివ్‌.. పాజిటివ్‌

పాజిటివ్‌.. నెగెటివ్‌.. పాజిటివ్‌

  • ఓ పారిశ్రామికవేత్త కరోనా రిపోర్టులు ఇవి
  • తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి 

డోన్‌, ఆగస్టు 8:   కరోనా పరీక్షలో వచ్చిన భిన్న రిపోర్టులు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముందు నెగెటివ్‌.. తర్వాత పాజిటివ్‌తో తీవ్ర అస్వస్థతకు గురై డోన్‌ పట్టణానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త శనివారం మృతి చెందారు. పట్టణానికి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు చిప్స్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నాలుగురోజుల క్రితం ఆ పారిశ్రామికవేత్త కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో కర్నూలులోని కోడుమూరు రహదారిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లారు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో సదరు పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లారు. అయితే ఒక రోజు తర్వాత ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం కర్నూలులోని అదే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మళ్లీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Updated Date - 2020-08-09T10:14:13+05:30 IST