మాస్కులు పంచిన వ్యక్తికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-05T14:05:00+05:30 IST
ప్రజలకు ఉచితంగా మాస్క్లు అందజేసిన వ్యక్తికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. తంజావూర్ జిల్లా వవూసి నగర్కు చెందిన
చెన్నై: ప్రజలకు ఉచితంగా మాస్క్లు అందజేసిన వ్యక్తికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. తంజావూర్ జిల్లా వవూసి నగర్కు చెందిన వ్యక్తి ‘మక్కల్ పాదై’ స్వచ్ఛంధ సంస్థ ద్వారా చెన్నై నగరంలో కరోనా బాధిత ప్రాంతాల ప్రజలకు ఉచితంగా మాస్క్లు అందజేశాడు. అతను తంజావూరుకు తిరిగి వెళ్లగా వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. తిరువారూర్ జిల్లాలో 113 మంది కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరగా, వారిలో 88 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.