తెలంగాణలో ట్రైనీ ఐఏఎస్లకు పోస్టింగులు
ABN , First Publish Date - 2021-06-27T03:22:58+05:30 IST
రాష్ట్రంలో 9 మంది ట్రైనీ ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: రాష్ట్రంలో 9 మంది ట్రైనీ ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనీ ఐఏఎస్లను అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్’గా మయాంక్ మిట్టల్ను, నల్గొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా అపూర్వ్ చౌహాన్ను, మహబూబాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా అభిషేక్ అగస్త్యాను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా మకరంద్ను, మెదక్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తానాజీ వాకడేను, ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా రాహుల్ను, మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా ప్రతిభా సింగ్ను, సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా ప్రఫుల్ దేశాయ్ను, నిర్మల్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కధిరవన్లకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసింది.