జేఈఈ మెయిన్స్-2021 పరీక్ష వాయిదా
ABN , First Publish Date - 2021-04-18T17:13:40+05:30 IST
దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్లు వాయిదాపడ్డాయి. తాజాగా జేఈఈ
హైదరాబాద్: దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్లు వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ కూడా ఈ జాబితాలో చేరింది. జేఈఈ మెయిన్స్-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సివుంది. అయితే.. కరోనా వైరస్ దృష్ట్యా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీకి 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చిలో పూర్తయ్యాయి. ఇక మూడో సెషన్ కరోనా వల్ల వాయిదా పడింది.