ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా

ABN , First Publish Date - 2021-11-13T01:16:17+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి ప్రజా సంగ్రామ యాత్రను తిరిగి చేపట్టాలని బీజేపీ నాయకులు  నిర్ణయించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల మీటింగ్‌లకు అనుమతి లేదని ఎన్నికల కమిషన్  చెప్పింది. ఎన్నికల కమిషన్ ఆంక్షల నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేశారు. యాత్రను మరల ఎప్పుడు చేపట్టేది త్వరలో వెల్లడిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. 


Updated Date - 2021-11-13T01:16:17+05:30 IST