‘టీడీపీకి స్థలం’ కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-04-13T09:46:20+05:30 IST
టీడీపీ కార్యాలయానికి గుంటూరు జిల్లా ఆత్మకూరు మండలంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్థలాన్ని కేటాయించారంటూ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యాలయానికి గుంటూరు జిల్లా ఆత్మకూరు మండలంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్థలాన్ని కేటాయించారంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేష్ రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించడం ప్రారంభించగానే..గురువారం తుదివిచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.